Friday 11 May 2012

సిమ్లా మిర్చి(కాప్సికం ) నువ్వుల కూర

కావాల్సిన పదార్థాలు :

సిమ్లా మిర్చి  10
నువ్వులు 150  గ్రాములు
పచ్చి మిరపకాయలు 5
ఎండు మిరపకాయలు 10
ఉప్పు సరిపడా
నూనే  100 మి లీ
ధనియాల పొడి రెండు చెంచాలు
కోతిమెర ఒక కట్ట
ఉల్లిపాయ ముద్ద 2 చిన్నవి
అల్లం వెల్లుల్లి 2 చెంచాలు
పసుపు కొద్దిగా
జీలకర్ర ఒక చెంచా
ఆవాలు కొద్దిగా
మెంతులు 10 (ఎక్కువగా వేసుంటే చెదు  వస్తాయి)
మసాల ఒక చెంచా
కరివేపాకు ఒక రెమ్మ

 మొదటగా నువ్వుల పిండి తయారు చేసుకోవాలీ.  కావాల్సిన నువ్వులలో  చెత్త లేకుండా చూసుకొని మంచి నీటి లో కడగాలి , ఇలా కదిగిన నువ్వులను నీడలో 5  నిముషాలు ఆరనివ్వాలి అలా చేయడం వల్ల నీళ్ళు అవిరైపోతాయి
 ఇప్పుడు ఒక  పెనం తేసుకుని స్టవ్ మీద పెట్టి  సన్నని మంట పైన నువ్వులు  పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి  మాడిపోకుండా ఎప్పుడు కలుపుతుండాలి. ఇలా  రెండు నిముషాలు అయ్యాక ఉవ్వులు గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత అదే పెనం పైన  ధనియాలు , ఎండు మిరపకాయలు ,మెంతులు , ఆవాలు ,కరివేపాకు ఒక నిమిషం పాటు సన్నని మంట పిన వేగనివ్వాలి . ఇలా వేయించుకున్న అన్నిటిని రోటిలో వేసి దంచుకోవాలి, నువ్వులు కూడా బాగా దంచుకోవాలి . ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో  ధనియాల పొడి ,   తాయారు చేసుకున్న మిశ్రమం , పసుపు , సగం ఉప్పు , అల్లం వెల్లుల్లి , సగం ఉల్లిపాయ ముద్ద  , కొద్దిగా నూనే వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి ,

 సిమ్లా మిర్చి బాగా కడిగి ఒక టవల్ తో నీటిని తుడవాలి . కాండం వైపు కాకుండా మరో వైపు రెండు  గాట్లు పెట్టుకోవాలి (సగం కంటే ఎక్కువ పెట్టుకోవడం వల్ల తాయారు చేసుకున్న మిశ్రం  పెట్టుకోవడానికి సరిపడా  స్తలం ఉంటుంది ).

ఒక కడాయిలో నూనే వేసుకుని జీలకర్ర , ఆవాలు , మెంతులు , అల్లంవెల్లుల్లి , పచ్చిమిరపకాయ ముక్కలు , ఉల్లిపాయ ముద్ద వేసుకుని రెండు నిముషాలు  ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .  వెంటనే  సిమ్ల మిర్చి వేసుకుని , పైన ఉప్పు చల్లుకోవాలి  .

 సన్నని మంట  మీద వేయించుకోవాలి  15 నిముషాలు సన్నని సెగ మెడ ఉడకనివ్వాలి , తరవాత మసాల , కోతిమెర చల్లుకొని దించుకోవాలి ..

 వేడివేడిగా వడ్డించు కోవాలి  ఇది అన్నలో  ఎంతో రుచిగా ఉంటుంది  స్నాక్స్ లా తినాలంటే పూర్తిగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి .......
 FOR ENGLISH VERSION:
 http://kmshomemadefood.blogspot.in/2012/05/sesame-seed-stuffed-capsicum-curry.html

No comments:

Post a Comment